TG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు GHMC ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్లో త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలపై సన్నద్ధత, పార్టీ బలోపేతంపై చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎంపీ రఘునందర్ రావు తదితరులు హాజరయ్యారు. కాగా, త్వరలో ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు.