KRNL: రంజాన్ పండుగ సందర్భంగా నగరంలోని సంతోష్ నగర్ వద్ద ఉన్న ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనలలో MP బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. ముందుగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్ధనలు చేసిన ఎంపీ అనంతరం వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. స్నేహం, కరుణ, క్రమ శిక్షణ దయగుణాలకు రంజాన్ ప్రతీకగా నిలుస్తుందన్నారు.