W.G: ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ పండుగను శనివారం నరసాపురంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. మిషన్ హైస్కూల్ రోడ్డులో ఉన్న ఈద్గా మైదానానికి ముస్లింలు, పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.