ATP: బెళుగుప్ప మండలం దూదేకుంట గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటను రైతు సంఘం నాయకులు శనివారం పరిశీలించారు. అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో కోతకు సిద్ధంగా ఉన్న పంట నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆరుగాలం శ్రమించిన రైతుకు అన్యాయం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు.