PDPL: రామగిరి మండలం సుందిళ్ళ గ్రామంలోని పెద్దచెరువులో గుర్రపుడెక్క కనుచూపు మేర పేరుకుపోయింది. అయితే, గుర్రపుడెక్కకు నీటిని పీల్చుకొని చెరువును త్వరగా ఖాళీ చేసే స్వభావం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక సూర్యరశ్మి లేక ఆక్సిజన్ శాతం తక్కువై చేపలు మృత్యువాత పడి నష్టం వాటిల్లుతుందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.