PLD: రాజధాని ల్యాండ్ పూలింగ్పై శుక్రవారం పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రైతుల అనుమానాలను నివృత్తి చేసి భూములు ఇవ్వడానికి ప్రోత్సహించాలని అధికారులకు ఆదేశించారు. ప్రక్రియ పూర్తైతే రాజధాని అభివృద్ధి వేగవంతమై రైతులకు లాభం చేకూరుతుందని తెలిపారు.