ADB: తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో వెలిసిన శ్రీ మహంకాళి ఆలయంలో ఈ నెల 24, 26, 27 తేదీల్లో ఆలయ 3వ వార్షికోత్సవ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాల వివరాలను వెల్లడించారు. 4 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు.