కృష్ణా: మచిలీపట్నం మైనారిటీ గురుకుల పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తుల గడువు ఈనెల 31తో ముగియనుంది. అభ్యర్థులకు ఏప్రిల్ 24న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పాఠశాల వర్గాలు తెలిపాయి. ఈ విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో 80, 6వ తరగతిలో 70, 7వ తరగతిలో 51, 8వ తరగతిలో 45 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల విద్యార్థులు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.