MDK: జిల్లా నవాబ్పేట ఈద్గా వద్ద రంజాన్ పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బందోబస్తును అదనపు ఎస్పీ మహేందర్ శుక్రవారం పరిశీలించారు. భద్రతా చర్యలు, పార్కింగ్ ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు సూచనలు ఇచ్చారు. మసీదుల వద్ద పటిష్ట భద్రత కల్పించామని తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని, ప్రధాన రహదారులు, చౌరస్తాల్లో ప్రత్యేక పికెట్స్ ఏర్పటు చేసినట్లు పేర్కొన్నారు.