ADB: రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. నేరడిగొండలోని మదీనా మస్జిద్లో శుక్రవారం రాత్రి నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మసీదు వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనుల కోసం రూ. 3లక్షల మంజూరు చేసినట్లు గజేందర్ పేర్కొన్నారు.