ములుగు మండలంలోని పలువురు ముస్లిం సోదర, సోదరీమణులకు స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. రంజాన్ పండుగను ములుగు మండల వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం సమాన ప్రాధాన్యతను ఇస్తుందని నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నేతలు ఉన్నారు.