WNP: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ పెబ్బేరు మండలంలోని పేద ముస్లిం సోదరులకు మున్సిపల్ ఛైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ రంజాన్ తోఫాను అందజేశారు. ప్రజలందరూ సంతోషంగా పండుగ జరుపు కోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘రంజాన్ తోఫా’ను అందజేస్తోందని ఆయన పేర్కొన్నారు. అనంతరం 9వ వార్డు లబ్ధిదారులకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు.