ADB: మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీ భవనంలో ‘తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్’ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా, EDM బండి రవి, టాస్క్ మేనేజర్ సాయి తదితరులున్నారు.