MNCL: నెన్నెలలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల హాజరు పట్టికలు, తరగతి గదులు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం, శుద్ధమైన తాగునీరు అందించాలన్నారు.