SRPT: ప్రైవేట్ విద్యుత్ బస్సుల విధానం వల్ల ఆర్టీసీ మనుగడ, ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడ్డాయని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు అన్నారు. 2021, 2025 వేతన సవరణలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సూర్యాపేట డిపో వద్ద సంతకాల సేకరణ నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న జరిగే రాష్ట్రవ్యాప్త ధర్నాలో కార్మికులందరూ పాల్గొలని కోరారు.