VKB: తాండూరులోని శాంతినగర్ కాలనీలో పాత మీసేవ ప్రభుత్వ భవనంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఎక్సైజ్ శాఖ కార్యాలయాలు ఒకే గదిలో కొనసాగుతున్నాయి. సమస్యల పరిష్కారానికై వచ్చే ప్రజలు ఒకే ప్రధాన ద్వారం ద్వారా లోపలికి వచ్చినప్పుడు తికమక పడుతున్నారు. ముందుగా అద్దె భవనంలో కొనసాగిన ఎక్సైజ్ కార్యాలయాన్ని ఇటీవల ట్రాఫిక్ PSలోకి మార్చారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.