సత్యసాయి: ఉగాది పరాభవ నామ సంవత్సరం పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నూతన తెలుగు కాల పట్టిక, డైరీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో MLA కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొని డైరీలను విడుదల చేశారు. హిందూ సంప్రదాయాలను, కాల గణనను ప్రజలకు చేరువ చేయడంలో వీహెచ్పీ కృషి అభినందనీయమని కొనియాడారు. కార్యకర్తలు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.