పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పుర దేవత బలుసులమ్మ వారికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దంపతులు ఎనిమిదోరోజు శుక్రవారం పట్టు వస్త్రాలు అందచేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ వడ్డే రఘురామ్ నాయుడు కూడా పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు.