NDL: APSSDC ఆధ్వర్యంలో ఈ నెల 25న నంద్యాలలోని NTR షాదీఖానలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 13 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై 870 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి నుంచి PG వరకు చదివిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన నిరుద్యోగులు నేరుగా హాజరు కావాలని ఆయన సూచించారు.