PDPL: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇవాళ మంథని మండలంలోని గద్దలపల్లి (బిట్టుపల్లి) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు వైద్యాధికారి డాక్టర్ సీహెచ్ మాధురి తెలిపారు. శిబిరంలో స్త్రీల, కంటి, దంత, ఎముకల, పిల్లల వైద్య నిపుణులతోపాటు జనరల్ ఫిజీషియన్లు సేవలు అందించనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.