SRD: హత్నూర మండలం కాసాల గ్రామంలో పాముకాటుకు గురై ముసునూరి సింధూజ (17) అనే బాలిక మృతి చెందింది. గురువారం తల్లిదండ్రులు పనికి వెళ్లి వచ్చేసరికి బాలిక అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించి మరణించింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.