GNTR: అన్నం పూర్ణచంద్రరావు నవ్య వారాహి ప్రైవేట్ లిమిటెడ్, ట్రేడ్ దోస్త్ పేర్లతో అరండల్ పేటలో ఆఫీస్ ఏర్పాటు చేశాడు. రూ.1 లక్ష పెట్టుబడికి రూ.2 లక్షలు లాభం, డ్రాలో 40 గ్రాముల బంగారం ఇస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసి ఈనెల 14న పరారయ్యాడు. బాధితురాలు చింతా శివ కోటేశ్వరి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.