KRNL: ఆత్మకూరు పట్టణానికి చెందిన ముర్తుజావలి (35) సిద్ధాపురం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, చెరువులో మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడికి నలుగురు కుమార్తెలు ఉన్నట్లు సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు.