కృష్ణా: మొవ్వ గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గారు ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ ఆశయాలు అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.