MNCL: కోటపల్లి మండలంలోని ఆలుగామ గ్రామంలో ప్రభుత్వ సొత్తు చోరీ కావడంపై చర్యలు తీసుకోవాలని పంచాయితీ కార్యదర్శికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. నర్సరీ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన సింటెక్స్ వాటర్ ట్యాంక్, శ్మశాన వాటిక దగ్గర సోలార్ లైట్ కనిపించడం లేదని తెలిపారు. ఈ మేరకు వెంటనే వీటిని రికవరీ చేయాలని అధికారులను కోరారు.