MDK: మనోహరాబాద్ మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర నాయకులు నత్తి మల్లేష్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. బుధవారం కాంగ్రెస్ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ ఆంజనేయులుకు మండల శాఖ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు.