RR: కొందుర్గ్ మండలంలోని ఉమ్మెంత్యాల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం 11 గంటలకు గ్రామసభ నిర్వహించనున్నారు. రేడియల్ రోడ్డు భూ బాధితుల సమస్యలపై చర్చించేందుకు RDO, MRO హాజరవుతారని సర్పంచ్ కమ్మదనం జ్యోతి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భూ బాధితులందరూ తప్పక హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరారు.