కొండపల్లి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు శనివారం సాయంత్రం పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని ఆయన అన్నారు. శుభప్రదమైన రంజాన్ పవిత్ర మాసంలో ఇస్లాం విధిగా వేకువజాముకు ముందే ఉపవాస దీక్ష చేపడతారన్నారు.