TG: గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా దంపతులు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్నారు. తెల్లవారుజామున స్వామి, అమ్మవార్ల మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు ఈవో ఘన స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులు ఆలయంలో స్వామివారికి భక్తిశ్రద్ధలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చన పూజలోనూ పాల్గొన్నారు.