NRML: కడెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రేపటి నుంచి జరగనున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని కడెం తహశీల్దార్ లచ్చిరాం, విద్యాధికారి షేక్ హుస్సేన్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించి పలు సూచనలు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాధికారి షేక్ హుస్సేన్ తెలిపారు.