CTR: 2025 డిసెంబర్ నెలలో జరిగిన ఎన్ఎంఎంఎస్ పరీక్షలలో నగరి మండలం నెత్తం కండ్రిగ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి కే.దిలీప్ ఎంపిక అయ్యాడు. ఈమేరకు ఎంఈవోలు పీఎన్ శ్రీదేవి, నమశ్శివాయ ఇవాళ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టుదల, కృషి ఉంటే ఏమైనా సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థిని ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.