మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మారుతి కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనిపై మారుతి స్పందించాడు. చిరంజీవి హీరోగా త్వరలోనే సినిమా తీస్తానని చెప్పాడు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. కాగా, ప్రస్తుతం చిరు ‘మన శంకరవరప్రసాద్ గారు’, మారుతి తెరకెక్కించిన’ రాజాసాబ్’ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.