SRCL: అభివృద్ధిలో ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకమని, జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ అన్నారు. తంగళ్ళపల్లి మండలం జిల్లెల బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రజా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. నూతనంగా గెలుపొందిన ప్రజా ప్రతినిధులకు విధులపై శిక్షణ ఇచ్చారు.