MBNR: పాలమూరు యూనివర్సిటీకి చెందిన NSS వాలంటీర్లు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్లో నిర్వహించిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఇవాళ వీసీ ప్రో. జిఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇలాంటి క్యాంపులు విద్యార్థుల్లో జాతీయ సమగ్రతను పెంపొందిస్తాయని తెలిపారు. NSS సమన్వయకర్త డా. కే. ప్రవీణ, కంటింజెంట్ లీడర్ సోమ్లా తదితరులు పాల్గొన్నారు.