చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీకి భారీ షాక్ తగిలింది. నిన్నే రిలీజైన ఈ చిత్రం ఇవాళ ఆన్లైన్లో ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా పైరసీ చేయడం నేరం అంటూ మండిపడుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని SM వేదికగా పోలీసులను కోరుతున్నారు. కాగా, ‘రాజాసాబ్’ పైరసీ ప్రింట్ కూడా ఒక రోజులోనే వచ్చిన విషయం తెలిసిందే.