తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన ‘పరాశక్తి’ మూవీని వెంటనే బ్యాన్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. హిందీ వ్యతిరేక ఉద్యమం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో తమ పార్టీని కించపరిచారని తమిళనాడు కంగ్రెస్ నేతలు ఆరోపించారు. అగ్రనాయకురాలు ఇందిరాగాంధీను తమిళులకు వ్యతిరేకంగా చూపించారని మండిపడుతున్నారు. కాగా, దర్శకురాలు సుధా కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కించింది.