SDPT: దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని అల్వాల ఎక్స్ రోడ్ చెప్యాల వద్ద ఉన్న పీఎంశ్రీ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాలలో నిర్మించనున్న కాంపౌండ్ వాల్ పనులను MLA కొత్త ప్రభాకర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన పాఠశాలలోని డార్మెటరీలు, శౌచాలయాలను పరిశీలించారు. దీంతో అక్కడి అపరిశుభ్రత గురించి పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.