SRCL: ఇల్లంతకుంట మండలంలో గురువారం ఉదయం పెను ప్రమాదం తృటిలో తప్పింది. వెంకటాపూర్ నుంచి జంగంరెడ్డిపల్లె వైపు విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పంట పొలంలోకి దూసుకెళ్లింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులు ఉన్నప్పటికీ, ఎవరికీ గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు.