NLR: కావలి MLA కావ్య క్రిష్ణారెడ్డి ఆశీస్సులతో ఏగూరి చంద్రశేఖర్ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులయ్యారు. సోమవారం ఆయన కావలి MLA నివాసంలో కావ్య క్రిష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధి, బలోపేతం కోసం నిబద్ధతతో పనిచేస్తానని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు.