దక్షిణ అమెరికాలోని సూరినామ్లో ఓ వ్యక్తి కత్తితో జరిపిన దాడిలో 9 మంది మరణించారు. రాజధాని పారమారిబో సమీపంలో ఈ ఘటన జరిగింది. బాధితులంతా నిందితుడి పిల్లలు, అతడి పొరుగువారని పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై అతడు దాడికి దిగాడని, మతిస్థిమితం లేదన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.