ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం నారాయణ స్వామి వారి ఆదివారం ఆదాయం రూ.1,09,628 వచ్చినట్లు ఈవో నరసింహ బాబు సోమవారం తెలిపారు. ఇందులో దర్శన టికెట్ల అమ్మకం ద్వారా రూ.45,370, ప్రసాదం విక్రయం ద్వారా రూ.14,830 ఆదాయం లభించిందన్నారు. అన్నదానానికి విరాళాల ద్వారా రూ.27,364, స్వామివారి శ్రీపాద కానుకల ద్వారా రూ.22,064 ఆదాయం వచ్చిందని ఈవో వెల్లడించారు.