KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరిగిన బీఈడీ 1వ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినట్లు వీసీ వెంకటబసవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2,474 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,016 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. ఫలితాల కోసం RU అధికారిక వెబ్సైట్ను సందర్శించాలన్నారు.