E.G: సహకార సంఘ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ నిడదవోలు డీసీసీబి కార్యాలయం వద్ద సహకార సంఘం ఉద్యోగులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఏళ్ల తరబడి తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కందుల దుర్గేశ్ కు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.