2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యం నెరవేరాలంటే వందేమాతరం స్ఫూర్తి అవసరమని ప్రధాని మోదీ అన్నారు. ‘జననీ జన్మభూమిశ్చ’ అన్న రాముడి మాటలకు వందేమాతరం మరో రూపమని ఆయన పేర్కొన్నారు. వందేమాతరం ఉద్దేశాన్ని, గౌరవాన్ని మళ్లీ తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దేశ ఐక్యతకు ఈ గీతం చిహ్నంగా నిలిచిందని తెలిపారు. వందేమాతరంపై చర్చలో స్వపక్షం, విపక్షం అంటూ తేడా లేదని పేర్కొన్నారు.