KNR: కరీంనగర్లో మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో కోర్టు శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది. 2022 ఫిబ్రవరి 3న త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనలో నిందితుడు మడుపు నర్సింహా చారికి POCSO చట్టం సెక్షన్ 6 కింద 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు శిక్షను ప్రకటించింది.