గుంటూరు నగర మేయర్ మరియు స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన, మున్సిపల్ (GMC) ప్రధాన కార్యాలయంలోని మేయర్ ఛాంబర్లో స్టాండింగ్ కమిటీ (స్థాయి సంఘం) సమావేశము జరిగింది. ఈ సమావేశంలో నగరాభివృద్ధి కొరకు గౌరవ సభ్యులు మరియు అధికారులు ప్రతిపాదించిన పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రజోపయోగకరమైన పలు అంశాలను మేయర్ ఆమోదించినట్లు వారు పేర్కొన్నారు.