జగిత్యాల జిల్లా కేంద్రం పురాణిపేటలోని శ్రీ లోకమాత పోచమ్మ ఆలయాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య శుక్రవారం సందర్శించారు. వారు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాజుల రాజేందర్, బండ శ్రీనివాస్, కామాటాలా శ్రీనివాస్, రాజగోపాల చారి తదితరులు పాల్గొన్నారు.