శ్రీకాకుళం జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఏడు కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వైద్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ వ్యాధి అపరిశుభ్ర పరిసరాలు, చిన్న పురుగు కుట్టడం వలన వస్తాయని డాక్టర్లు తెలిపారు. కొత్తూరు, హిరమండలం, గార మండలాల్లో ఈ బాధితులు ఉన్నారు.