అయోధ్యలోని రామ్లల్లా మందిర శిఖరంపై అభిజిత్ ముహూర్తంలో ప్రధాని మోదీ ధ్వజారోహణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ శిఖరంపై కాషాయ రంగు ధర్మధ్వజాన్ని ఎగురవేశారు. ఈ ధర్మధజంపై శ్రీరాముడు, సూర్యుడు, ఓం, కోవిదర చెట్టు చిహ్నాలను ముద్రించారు. అలాగే కాషాయ జెండాపై రాముడి తేజస్సును, శౌర్యాన్ని సూచించేలా చిహ్నాలు ఏర్పాటు చేశారు.