ప్రకాశం: బేస్తవారిపేటలోని పలు లాడ్జిలను ఎస్ఐ రవీంద్రారెడ్డి సోమవారం రాత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల భద్రతను ప్రాధాన్యంగా తీసుకొని రాత్రి వేళల్లో నేర కార్యకలాపాలను నిరోధించడం, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం, శాంతి భద్రతలను కాపాడడం లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.